రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2022-10-03T04:53:35+05:30 IST

మండల పరిధిలోని నాగారం కాలనీ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

పాల్వంచ, అక్టోబరు 2: మండల పరిధిలోని నాగారం కాలనీ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఆమె కూతురు గాయలతో బయట పడింది. పోలీసుల కథనం ప్రకారం పాల్వంచ బోల్లోరిగూడేనికి చెందిన పడాల అన్నపూర్ణ (40) పా ల్వంచ మునిసిపల్‌ కార్యాలయంలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి. చుట్టాల ఇంటికి తన కూతురు పింకీతో వెళ్లిన ఆమె పని ముగించుకుని రాత్రి సమయంలో తన స్కూటీపై పాల్వంచకు తిరుగు ప్రయాణమయ్యింది. నాగారం కాలనీ వద్దకు రాగానే అకస్మాత్తుగా వరాహం అడ్డు రావడంతో దానిని తప్పించబోతూ వాహనం అదుపు తప్పి ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. ఈఘటనలో అన్నపూర్ణ తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం ఏర్పడింది. స్థానికులు గమనించి హుటాహుటిన వారిని పాల్వంచ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో ఖమ్మం తరలిస్తుండగా మార్గమద్యంలో అన్నపూర్ణ మృతిచెందింది. ఆమె కూతురు పింకీకి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి తండ్రి భాస్కర్ల వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - 2022-10-03T04:53:35+05:30 IST