గేదెను ఢీకొట్టి ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-07-01T06:23:04+05:30 IST

రాజానగరం శివారు సూర్యారావుపేటలో గేదెను ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

గేదెను ఢీకొట్టి ఒకరి మృతి

రాజానగరం, జూన్‌ 30 : రాజానగరం శివారు సూర్యారావుపేటలో గేదెను ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. జలగం మహేష్‌ కుమార్‌ (42)  గైట్‌ కళాశాలలో ఫాక్యల్టీగా పనిచేస్తూ, కళాశాల క్వార్టర్స్‌లో నివాసం ఉంటు న్నాడు. గురువారం రాత్రి మోటార్‌ సైకిల్‌పై రాజానగరం వచ్చి తిరిగి వెళ్తూ మార్గమధ్యలో సూర్యారావుపేట వద్ద గేదెను ఢీకొన్నాడు.ప్రమాదంలో మహేష్‌ కుమార్‌ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు, ప్రమాదంలో గేదెకు కాలు విరిగినట్టు తెలుస్తోంది. రాజానగరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-07-01T06:23:04+05:30 IST