రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
ABN , First Publish Date - 2022-10-05T06:25:53+05:30 IST
కృష్ణాపురం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.
మధిర రూరల్, అక్టోబరు 4: కృష్ణాపురం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఇన్నోవా కారు, బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బోనకల్ మండలం కలకోటకు చెందిన నీలం వెంకటేశ్వరరావు, మొగిలిలు ద్విచక్రవాహనంపై మధిర వైపు వస్తున్నారు. మార్గమధ్యలో కృష్ణాపురం- ఆత్కూరు మధ్య వెంచర్ల వద్ద ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు వీరిని కొట్టింది. దీంతో బైక్పై ఉన్న వెంకటేశ్వర్లు, మొగిలికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ద్విచక్రవాహనం వెనకే బైక్పై వస్తున్న బోనకల్ మండలం జానకీపురానికి చెందిన కోట వెంకటేష్కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇన్నోవా కారు ముందుభాగం దెబ్బతి నగా, బైక్ నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు సంఘ టనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.