మహా నగరాల్లో మళ్లీ ప్రమాద ఘంటికలు
ABN , First Publish Date - 2022-06-28T08:36:46+05:30 IST
దేశంలో వరుసగా రెండు రోజులు తగ్గినట్లే తగ్గిన కొవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి. మహా నగరాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
దేశంలో కొవిడ్ కొత్త కేసులు 17 వేలు
న్యూఢిల్లీ, జూన్ 27: దేశంలో వరుసగా రెండు రోజులు తగ్గినట్లే తగ్గిన కొవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి. మహా నగరాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఆదివారం 3.03 లక్షలమందికి టెస్టులు చేయగా 17,073 మందికి వైరస్ నిర్ధారణ అయింది. శనివారం (11,739)తో పోలిస్తే 5,334 కేసులు అధికంగా నమోదయ్యాయి. పాజిటివ్ రేటు 5.62కు పెరిగింది. కొవిడ్తో తాజాగా 21 మంది చనిపోయారు. కొత్త కేసుల్లో పదివేలపైగా మహారాష్ట్ర (6,493), కేరళ (4 వేలు)ల్లోనే నమోదయ్యాయి. ముంబైలో 2,771 పాజిటివ్లు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 2 వేలు, తమిళనాడులో 1,472 మందికి వైరస్ సోకింది. ఇందులో చెన్నైలోనే 624 కేసులు వచ్చాయి.