పేరుకుపోతున్న ధాన్యం

ABN , First Publish Date - 2021-05-11T05:09:12+05:30 IST

పేరుకుపోతున్న ధాన్యం

పేరుకుపోతున్న ధాన్యం
పెద్దనందిగామలో కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యం బస్తాలు

  • తరలించేందుకు లారీల కొరత 


కొడంగల్‌: రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతోంది. మండలంలోని పెద్దనందిగామ గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 3న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు 5,453 బస్తాల వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రాకపోవడంతో సంఘం సభ్యులు కొనుగోళ్లను నిలిపివేశారు.  సంబంధిత అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-11T05:09:12+05:30 IST