కామాంధుడి అరెస్టు

ABN , First Publish Date - 2021-06-24T05:07:45+05:30 IST

మామిడికాయలు కోసిస్తానని బాలికపై లైంగిక దాడికి పాల్పడిన మృగాడిని దిశ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను నెల్లూరులోని దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్పీ పీ వెంకటరత్నం బుధవారం విలేకర్ల సమావేశంలో తెలిపారు.

కామాంధుడి అరెస్టు
మాట్లాడుతున్న ఏఎస్పీ వెంకటరత్నం

మామిడికాయలు కోసిస్తానని బాలికపై లైంగికదాడి

నెల్లూరు(క్రైం), జూన్‌ 23: మామిడికాయలు కోసిస్తానని బాలికపై లైంగిక దాడికి పాల్పడిన మృగాడిని దిశ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను నెల్లూరులోని దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్పీ పీ వెంకటరత్నం బుధవారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. సైదాపురం మండలం చాగణం గ్రామం ఎర్ర సంగానికి చెందిన సుబ్రహ్మణ్యం జులాయిగా తిరుగుతుంటాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ 29వ తేదీన సుబ్రహ్మణ్యం అదే మండలంలోని జాఫలాపురం గ్రామానికి వెళ్లాడు. అక్కడి గిరిజన కాలనీలో ఓ బాలిక ఇంటి బయట కూర్చొని చెల్లెలిని ఆడిస్తుండగా ఆ బాలికను పిలిచి మామిడికాయలు కోసిస్తానని నమ్మించి పక్కనే ఉన్న జామాయిల్‌ తోటలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి సైదాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ శివశంకరరావు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దిశ డీఎస్పీ యూ  నాగరాజు కేసు దర్యాప్తు చేపట్టారు. స్థానిక పోలీసుల సహకారంతో బుధవారం తెల్లవారుజామున నిందితుడిని సైదాపురం బస్టాండు వద్ద అరెస్ట్‌ చేశారు. త్వరలోనే కోర్టులో చార్జిషీటు దాఖలుచేస్తామని ఏఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ నాగరాజు, ఇన్‌స్పెక్టర్‌ ఏవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T05:07:45+05:30 IST