చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2021-06-22T04:54:36+05:30 IST

పలు చోరీ కేసుల్లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు
నిందితుడి అరెస్టు చూపుతున్న పోలీసులు

గుర్రంకొండ, జూన్‌ 21: పలు చోరీ కేసుల్లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. వాల్మీకీపురం సీఐ నాగార్జునరెడ్డి కథనం మేరకు.. అనంతపురం జిల్లా కదిరి పట్టణం నిజాం కాలనీకి చెందిన అరుణ్‌కుమార్‌(22) పది రోజుల క్రితం గుర్రంకొండ, తరిగొం డలోని దుకాణాలలో చోరీలు చేశాడు. నిందితుడైన అరుణ్‌కుమార్‌ సోమవారం స్థానిక మార్కెట్‌ యార్డు వద్ద ద్విచక్ర వాహనంలో వెళుతుండగా పట్టుకున్నారు. నిందితుడి 31.571 గ్రాముల బంగారం, రూ.10.550 నగదు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాల్మీకిపురం కోర్టుకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ హరిహరప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T04:54:36+05:30 IST