జీవన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు
ABN , First Publish Date - 2022-08-06T16:41:15+05:30 IST
TS News: ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు మూడు రోజులుగా నిందితుడు
TS News: ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు మూడు రోజులుగా నిందితుడు ప్రసాద్ను విచారిస్తున్నారు. ఎమ్మెల్యేను చంపడానికే వచ్చినట్లు పోలీసుల నిర్ధారించారు. హత్య కుట్రలో వాడిన కత్తిని రూ. 1800కు నాందేడ్లో, యూపీలో రూ.32 వేలకు తుపాకీని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ప్రసాద్ బుల్లెట్ల కోసం బీహర్ వెళ్లాడని, అవి లభించకపోవడంతో బొమ్మ తుపాకీ కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. అయితే ఎమ్మెల్యే హత్యాయత్నం కుట్ర వెనక నిందితుడికి పెద్ద వ్యక్తులు సహకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసులో నిందితుడు ప్రసాద్ భార్య మాజీ సర్పంచ్ లావణ్యను A2 గా పోలీసులు చేర్చారు.