అత్యాచారం కేసు..నిందితుడికి 20 ఏళ్ల జైలు
ABN , First Publish Date - 2022-09-08T17:55:36+05:30 IST
అత్యాచారం కేసులో నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష జరిమానా విధించింది. బార్కాస్ ప్రాంతానికి చెందిన యూసుఫ్ బవాజీర్ ఓ బాలుడితో
హైదరాబాద్ సిటీ: అత్యాచారం కేసులో నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష జరిమానా విధించింది. బార్కాస్ ప్రాంతానికి చెందిన యూసుఫ్ బవాజీర్ ఓ బాలుడితో స్నేహం చేశాడు. 2018 మేలో బాలుడు ఇంటరిగా ఉన్న సమయంలో అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. బుధవారం కేసును విచారించిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి కవిత నిందితుడు యూసు్ఫకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.