హత్య కేసులో నిందితులకు 10ఏళ్ళ జైలు శిక్ష

ABN , First Publish Date - 2021-11-16T01:15:49+05:30 IST

మద్యం మత్తులో తోటి కూలీని హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులకు

హత్య కేసులో నిందితులకు 10ఏళ్ళ జైలు శిక్ష

హైదరాబాద్: మద్యం మత్తులో తోటి కూలీని హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులకు 10ఏళ్ళ జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆదిభట్ల పీఎస్ పరిధిలో గత ఏడాది ఫిబ్రవరిలో ఈ  ఘటన జరిగింది. కూలీపని కోసం నాంపల్లి లేబర్ అడ్డా నుంచి ముగ్గురు కూలీలను కాంట్రాక్టర్ రియాజ్ తీసుకెళ్ళాడు. పనిచేస్తున్న సమయంలో మద్యం మత్తులో ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది.వీరిలోని అబ్దుల్లా తలపై ఫైర్ సిలిండర్‌తో మిగితా ఇద్దరు కూలీలైన హనుమాన్, బంధన్ కుమార్ చితక బాదారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అబ్దుల్లా రెండు రోజులకే మృతి  చెందాడు. ఘటనపై కాంట్రాక్టర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరిపి సాక్ష్యాలను కోర్టుకు ఆదిభట్ల పోలీసులు సమర్పించారు.  విచారణ జరిపిన కోర్టు నిందితులకు 10ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. 

Updated Date - 2021-11-16T01:15:49+05:30 IST