3 రోజుల కిందటే దొరికాడు.. పోలీసులు ఉరికించి చంపేశారు!: రాజు తల్లి

ABN , First Publish Date - 2021-09-16T19:30:14+05:30 IST

హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడైన పులికొండ రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.

3 రోజుల కిందటే దొరికాడు.. పోలీసులు ఉరికించి చంపేశారు!: రాజు తల్లి

యాదాద్రి భువనగిరి: హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడైన పులికొండ రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఘటనపై నిందితుడి తల్లి వీరమ్మ అనుమానం వ్యక్తం చేస్తోంది. అడ్డగూడురు మండలం కేంద్రంలో ఉన్న ఆమె ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. పోలీసులే తన కొడుకుని ఉరికించి ఉరికించి చంపేశారని ఆరోపించింది. ‘‘నా కొడుకు రాజు 3 రోజుల కిందటే రైల్వేస్టేషన్‌లో పోలీసులకు దొరికాడు. రాజును ఎన్‌కౌంటర్ చేయాలని, పై నుంచి ఆర్డర్స్ వచ్చాయని పోలీసులు మాట్లాడుకుంటుంటే విన్నాం. నిన్న మొత్తం మా వివరాలన్నీ రాసుకున్నారు. మూడు రోజుల నుంచి స్టేషన్‌లో ఉన్నా ఎవరూ రాలేదు. నిన్న ఒక్కసారిగా అందరూ వచ్చారు. అప్పుడే మాకు డౌట్ వచ్చి అడిగితే దొరకలేదన్నారు. మిమ్మల్ని వదిలేస్తున్నాం అని నిన్న రాత్రి 10 గంటలకు ఉప్పల్‌లో వదిలిపెట్టారు. పోలీసులే నా కొడుకును ఉరికించి చంపేశారు. వాళ్లకు 3 రోజుల కిందటే దొరికినా ఈ రోజు మమ్మల్ని ఇటు పంపించి వాడిని అటు చంపేశారు.’’ అని ఆమె విలపించింది.

Updated Date - 2021-09-16T19:30:14+05:30 IST