AP News: కానిస్టేబుల్ హత్య కేసులో నిందితులకు రిమాండ్‌

ABN , First Publish Date - 2022-08-22T21:54:39+05:30 IST

Nandyal: నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్రనాధ్ హత్య కేసులో నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. జిల్లా అదనపు జడ్జి అర్చన నిందితులను రిమాండ్‌కు ఆదేశించడంతో భారీ బందోబస్తు మధ్య ఎనిమిది మంది

AP News: కానిస్టేబుల్ హత్య కేసులో నిందితులకు రిమాండ్‌

Nandyal: నంద్యాలలో కానిస్టేబుల్ (Constable) సురేంద్రనాధ్ హత్య (Murder) కేసులో నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. జిల్లా అదనపు జడ్జి అర్చన నిందితులను రిమాండ్‌కు ఆదేశించడంతో భారీ బందోబస్తు మధ్య ఎనిమిది మంది నిందితులను పోలీసులు కడప సెంట్రల్‌ జైల్‌కు తరలించారు. 

కత్తులతో పొడిచి..

నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్ర కుమార్ ఇటీవల దారుణ హత్యకు గురయ్యారు. పట్టణంలోని రాజ్ థియేటర్ సమీపంలో రాత్రి 10.30 గంటల సమయంలో సురేంద్రను కొందరు దుండగులు అడ్డుకుని ఆటోలో కిడ్నాప్ చేశారు. అక్కడ నుంచి పట్టణ శివారులోని చెరువుకట్ట ప్రాంతానికి తీసుకెళ్లి కత్తులతో పొడిచి హతమార్చారు. అదే ఆటోలో పట్టణంలోకి తిరిగి వస్తూ అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆటో డ్రైవర్‌కు చెప్పారు.. కానీ మార్గం మధ్యలో దిగి పరారయ్యారు. సురేంద్రకుమార్‌ను ఆటో డ్రైవర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ డాక్టర్లు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్దారించారు. మద్యం దుకాణం వద్ద తాగుతున్న నిందితులను సురేంద్ర కుమార్ హెచ్చరించడంతో గొడవ మొదలైంది. 

Updated Date - 2022-08-22T21:54:39+05:30 IST