‘ఆచార్య’కు ఘన స్వాగతం

ABN , First Publish Date - 2021-02-22T07:50:02+05:30 IST

మేట్నీ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తు న్న సినిమా షూటింగ్‌ తాజా షెడ్యూల్‌ తూర్పు ఏజెన్సీ మారేడుమిల్లిలో ఇటీ వల ప్రారంభమైంది.

‘ఆచార్య’కు ఘన స్వాగతం
మధురపూడి విమానాశ్రయం వద్ద అభిమానులకు చిరు అభివాదం

మారేడుమిల్లి/కోరుకొండ, ఫిబ్రవరి 21: మేట్నీ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తు న్న సినిమా షూటింగ్‌ తాజా షెడ్యూల్‌ తూర్పు ఏజెన్సీ మారేడుమిల్లిలో ఇటీ వల ప్రారంభమైంది. షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆదివారం మారేడుమిల్లి విచ్చేసిన చిరంజీవికి మధురపూడి విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. చిరంజీవి ఆచార్య సినిమా షుటింగ్‌ నిమిత్తం ఆదివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ఉదయం పదిన్నరకు ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ బందో బస్తు మధ్య కారులో బయలుదేరి షూటింగ్‌ నిమిత్తం మారేడుమిల్లికి బయ లుదేరారు. ఈ సందర్భంగా విమానాశ్రమం బయట గేటువద్ద రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపు కారు ఆపి అక్కడకు వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనపై పూలవర్షం కురిపించారు. అనంతరం ప్రత్యేక కాన్యాయ్‌లో చిరంజీవి మారేడుమిల్లిలోని ది ఉడ్స్‌ రిసార్ట్స్‌కు చేరుకున్నారు. ఇప్ప టికే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న హీరో రామ్‌చరణ్‌ కొద్దిరోజులుగా మారేడుమిల్లిలోనే ఉండి షూటింగ్‌ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఆది వారం చిరంజీవి రాకతో మారేడుమిల్లిలో అభిమానుల కోలాహాలంతో సందడి నెలకొంది. మారేడుమిల్లి, గుడిస అటవీ ప్రాంతంలో ఆచార్య షూ టింగ్‌ జరగనుంది. నార్త్‌జోన్‌ డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో కోరుకొండ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ విజయకుమార్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-02-22T07:50:02+05:30 IST