Jagan ప్రభుత్వానికి Achennaidu సవాల్
ABN , First Publish Date - 2022-06-09T20:21:03+05:30 IST
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ చేశారు.
Amaravathi: జగన్మోహన్ రెడ్డి (Jaganmohan reddy) ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Achennaidu) సవాల్ విసిరారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 175 అసెంబ్లీ సీట్లు గెలుస్తామనే నమ్మకం ఉంటే.. సీఎం జగన్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికలకు సిద్దపడాలన్నారు. గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తున్నట్టు ప్రకటించాలన్నారు. 175 స్థానాలను వైసీపీ గెలిస్తే టీడీపీ కార్యాలయానికి తాళాలేస్తామని అచ్చెన్నాయుడు అన్నారు.