జూమ్ పాలిటిక్స్‌పై Achennaidu కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-06-09T20:42:07+05:30 IST

జూమ్ పాలిటిక్స్‌పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

జూమ్ పాలిటిక్స్‌పై Achennaidu కీలక వ్యాఖ్యలు

Amaravathi: జూమ్ పాలిటిక్స్‌ (Zoom Politics‌)పై  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Achennaidu) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి పరీక్షా ఫలితాలపై మంత్రి బొత్స జూమ్ కాన్ఫరెన్స్ పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం, వైసీపీ నేతల జీవితాలే ఫేక్ అని ఆరోపించారు. లోకేష్ నిర్వహిస్తున్న జూమ్‌ కార్యక్రమంలోకి వైసీపీ వాళ్లు దొంగల్లా జొరబడ్డారని విమర్శించారు. పిల్లల్ని భయపెట్టి జూమ్ కాన్ఫరెన్సులోకి వైసీపీ నేతలు వచ్చారని మండిపడ్డారు. ‘‘మా జూమ్ కాన్ఫరెన్సులోకి రావడం కాదు.. విద్యార్థులతో మంత్రి బొత్స జూమ్ కాన్ఫరెన్స్ పెట్టగలరా?.. మంత్రి బొత్స కాన్ఫరెన్స్ పెడితే.. విద్యార్థులు, తల్లిదండ్రులు జూమ్‌లోనే చీపుర్లతో కొడతారు.. ముఖాన ఉమ్మేస్తారు.. పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని దద్దమ్మలు.. పనికి మాలిన వెధవలు జొరబడ్డారు.. వైసీపీది ఫేక్ పార్టీ అని నిరూపితం అయింది. జూమ్ కాన్ఫరెన్సులోకి వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. పదో తరగతి పాస్ కాని వెధవలు జూమ్ కాన్ఫరన్సులోకి వచ్చారు.. 2 లక్షల మంది విద్యార్థులు తప్పలేదా..?, కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చోసుకోలేదా..?, విద్యార్థులకు మనో ధైర్యం కల్పించాలని మేం కాన్ఫరెన్స్ పెడితే దొంగల్లా వచ్చారు.. విద్యార్ధులు తప్పలేదని.. ఆత్మహత్యలు చేసుకోలేదంటే మేం క్షమాపణ చెబుతాం’’ అని అచ్చెన్నాయుడు అన్నారు.

Updated Date - 2022-06-09T20:42:07+05:30 IST