ఛాలెంజ్ చేస్తున్నారు కదా..ఎన్నికలకు వెళదాం..: అచ్చెన్న

ABN , First Publish Date - 2022-03-09T20:40:03+05:30 IST

ఛాలెంజ్ చేస్తున్నారు కదా..ఎన్నికలకు వెళదామంటూ అచ్చెన్నాయుడు వైసీపీకి సవాల్ చేశారు.

ఛాలెంజ్ చేస్తున్నారు కదా..ఎన్నికలకు వెళదాం..: అచ్చెన్న

అమరావతి: ఛాలెంజ్ చేస్తున్నారు కదా..ఎన్నికలకు వెళదామంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీకి సవాల్ చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ఎపుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇంకా వ్యతిరేకత పెరిగితే నష్టం జరుగుతుందని.. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని అన్నారు. తోందర్లోనే ఎన్నికలు వస్తాయని ప్రజలు అనుకుంటున్నారని.. మేము కూడా భావిస్తున్నామని అన్నారు. ఈసారి టీడీపీకి 160 సీట్లు వస్తాయన్నారు. గుడ్డిగా చెప్పడం లేదని, రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉన్నాయని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-03-09T20:40:03+05:30 IST