మీడియా అంటే వైసీపీకి ఎందుకు భయం: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2020-11-30T02:12:32+05:30 IST
తుగ్లక్ పాలన బయటపడుతుందనే అసెంబ్లీలోకి మీడియాను అనుమతించడంలేదని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. మీడియాను..
విజయవాడ: తుగ్లక్ పాలన బయటపడుతుందనే అసెంబ్లీలోకి మీడియాను అనుమతించడంలేదని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. మీడియాను అనుమతించకపోవడం.. జగన్ అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని ఆయన విమర్శించారు. కోవిడ్ను అడ్డుపెట్టుకుని తుగ్లక్ పాలనను దాచాలని చూస్తున్నారని మండిపడ్డారు. పాఠశాలలు, మద్యం షాపులకు అడ్డురాని కరోనా నిబంధనలు అసెంబ్లీలో మీడియా పాయింట్కు అడ్డు వస్తున్నాయా? అని వ్యాఖ్యానించారు. మీడియా అంటే వైసీపీకి ఎందుకు భయమని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.