YSRCP ముష్కరులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి: అచ్చెన్న

ABN , First Publish Date - 2021-07-18T17:15:43+05:30 IST

వైసీపీ ముష్కరులు ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

YSRCP ముష్కరులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి: అచ్చెన్న

అమరావతి: వైసీపీ ముష్కరులు ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూజివీడులో టీడీపీ కార్యకర్తలు మంచోడు జీబీ మణి, కుంకునోళ్ళ నాగబాబుపై వైసీపీ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముష్కరుల మాదిరి దారి కాచి టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే నిందితులపై కేసు నమోదు చేసి శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


వైసీపీ నేతలకు పట్టిన దాడుల దాహాన్ని త్వరలోనే తీరుస్తామని, టీడీపీ వారితో ఎందుకు పెట్టుకున్నామా? అని దిగులు పడే రోజులు దగ్గర్లలోనే ఉన్నాయని అచ్చెన్నాయుడు అన్నారు. బాధితులు దాడిచేసిన వారిపై కేసు పెడితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడం ఆక్షేపనీయమన్నారు. తిరిగి బాధితులపైనే కేసులు పెట్టే వింతైన సాంప్రదాయానికి ఏపీ పోలీసులు నాంది పలికారన్నారు. పోలీసులు వేసుకుంది నీలి చొక్కాలు కాదని.. ఖాకీ చొక్కాలన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. శాంతిభ్రదతల పట్ల డీజీపీకి విశ్వాసం ఉంటే ఇప్పటి వరకు జరిగిన అరాచకాలపై విచారణ జరిపి నిందితులను శిక్షించాలని అచ్చెన్నాయుడు అన్నారు.

Updated Date - 2021-07-18T17:15:43+05:30 IST