TDP: బాలకోటిరెడ్డిపై దాడిని ఖండించిన అచ్చెన్న

ABN , First Publish Date - 2022-07-19T14:35:44+05:30 IST

జిల్లాలోని రొంపిచెర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై వైసీపీ రౌడీలు చేసిన దాడిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు.

TDP: బాలకోటిరెడ్డిపై దాడిని ఖండించిన అచ్చెన్న

పల్నాడు: జిల్లాలోని రొంపిచెర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై వైసీపీ(YCP) మూకలు చేసిన దాడిని టీడీపీ(TDP) రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (achennaidu)  తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌రెడ్డి (CM JAGAN) ప్యాక్షన్ భావాలను నరనరనా నింపుకున్న వైసీపీ కార్యకర్తలు మృగాల కంటే హీనంగా ప్రవరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రోజూ సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. అధికార మదంతో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వైసీపీ నేతలను హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక  వైసీపీ గుండాలకు ప్రత్యేకంగా ‘‘కంటికి కన్ను, పంటికి పన్ను’’ అనే పథకం అమలు చేస్తే మీ పరిస్థితి ఏంటి ? అని ప్రశ్నించారు.ఫిజిక్స్‌లో చర్యకు ప్రతి చర్య ఉన్నట్టు ఇప్పుడు వైసీపీ మూకలు చేసే ప్రతి అరాచకానికి కర్మఫలం ఉంటుందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

Updated Date - 2022-07-19T14:35:44+05:30 IST