జగన్ నోటి వెంట అమ్మడం తప్ప.. ఇంకో మాట రాదు: అచ్చెన్న

ABN , First Publish Date - 2021-12-21T23:50:13+05:30 IST

పుట్టిన రోజున సీఎం జగన్మోహన్‌రెడ్డి పేదల రక్తాన్ని పీల్చే కార్యక్రమం ప్రారంభించారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

జగన్ నోటి వెంట అమ్మడం తప్ప.. ఇంకో మాట రాదు: అచ్చెన్న

అమరావతి: పుట్టిన రోజున సీఎం జగన్మోహన్‌రెడ్డి పేదల రక్తాన్ని పీల్చే కార్యక్రమం ప్రారంభించారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘జగన్ నోటి వెంట అమ్మడం అనే పేరు తప్ప ఇంకో మాట రావట్లేదు.ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు హయాం వరకు ఇచ్చిన ఇళ్లపై జగన్ ఇప్పుడు భారం మోపుతున్నారు.జగన్ తన పుట్టిన రోజు ఓటీఎస్ అని ఒక దుర్మార్గమైన కార్యక్రమం మొదలెట్టారు.అసలు ఓటీఎస్‌పై జగన్‌కు ఏమి హక్కు ఉంది. ఐదేళ్లలో 32 లక్షల ఇళ్లు కడతామని చెప్పిన జగన్.. 30 నెలల్లో ఒక్క ఇల్లు అయిన కట్టారా!?. 2014-2019 మధ్య టీడీపీ హయాంలో 7.52 లక్షల ఇళ్లు కట్టింది వాస్తవం కాదా!?.జగన్ ఇచ్చే ఇంటి పట్టా చెల్లుబాటు కాదు. 5 వేల కోట్ల దోపిడీ కోసమే ఓటీఎస్ కార్యక్రమం.పేదల ఇళ్లకు 3.10 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం. ఇప్పటికీ కేవలం 5.43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఉపయోగించారు.ఎప్పుడు 32 లక్షల ఇళ్లు కడతారు... ఎలా కడతారు!?.చివరికి పుట్టిన రోజున కూడా జగన్ నిజం మాట్లాడలేదు. పేదలపై ప్రేమ ఉంటే ఉచితంగా ఓటీఎస్ చెయాలి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి ఇస్తాం.ఓటీఎస్ కట్టకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తున్నారు ఇది దారుణం.నీ పాలన బాలేదని సొంత పార్టీ వాళ్లు చెప్పినా దాడులు చేస్తున్నారు. దాడి చేసిన గుప్తాను పిచ్చివాడు అన్నారు. ఇప్పుడు మంత్రి పిలిచి కేక్ పెట్టారు. వైసీపీ పాలన దరిద్రం ఎప్పుడు వదులుతుందని జనం ఎదురు చూస్తున్నారు.’’ అని సీఎం జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Updated Date - 2021-12-21T23:50:13+05:30 IST