అభినవ రక్త పిశాచాలుగా వైసీపీ నేతలు:అచ్చెన్న

ABN , First Publish Date - 2021-12-21T21:45:00+05:30 IST

టీడీపీ కార్యకర్త వెంకటనారాయణపై హత్యాయత్నం దుర్మార్గమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

అభినవ రక్త పిశాచాలుగా వైసీపీ నేతలు:అచ్చెన్న

అమరావతి: టీడీపీ కార్యకర్త వెంకటనారాయణపై హత్యాయత్నం దుర్మార్గమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘అభినవ రక్త పిశాచాలుగా వైసీపీ నేతలు మారారు. క్రూర జంతువుల కంటే దారుణంగా రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులు తయారయ్యారు.ప్రశ్నించిన వారిని తమను ప్రశ్నించేవారే ఉండకూడదు. ఎందురించిన వారు బతికి ఉండకూడదు అనేలా వ్యవహరిస్తున్నారు.గుంటూరు జిల్లా పెదనందిపాడులో టీడీపీ కార్యకర్త వెంకటనారాయణపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన వైసీపీ నేతల క్రూరత్వానికి సజీవ సాక్ష్యం. ఫిట్స్‌తో ఇబ్బంది పడుతున్న వ్యక్తిని మద్యం బాటిళ్లతో కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించడం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారాయో చెప్పడానికి నిదర్శనం.గతంలో నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్త కాలు విరగ్గొట్టారు. ఇప్పుడు పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడిచేసి, హత్యలు చేసి పైశాచిక ఆనందం పొందొచ్చు.కానీ.. రేపు అనేది ఒకటి ఉందనే విషయం వైసీపీ కార్యకర్తలు గుర్తుంచుకోవాలి.ఈరోజు మా కార్యకర్తలకు జరిగిన ప్రతి దాడికీ సమాధానం చెప్పడం తధ్యమని గుర్తుంచుకోవాలి.వెంకటనారాయణకు ఏం జరిగినా అందుకు జగన్‌రెడ్డే బాధ్యత వహించాలి. ప్రతి కార్యకర్తకూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ప్రతి దాడికీ సమాధానం చెప్పడం తధ్యమని జగన్‌రెడ్డి గుర్తుంచుకోవాలి.’’ అని అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-12-21T21:45:00+05:30 IST