హంద్రీ-నీవా నీటి కోసం పాదయాత్ర చేస్తే అడ్డుకుంటారా?: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2020-10-26T23:32:15+05:30 IST
హంద్రీ-నీవా నీటి కోసం పాదయాత్ర చేస్తే అడ్డుకుంటారా?: అచ్చెన్నాయుడు
అమరావతి: హంద్రీ-నీవా నీటి కోసం పాదయాత్ర చేస్తే అడ్డుకుంటారా? అని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. హంద్రీనీవాపై ప్రతిపక్షంలో ప్రగల్భాలు..నేడు అరెస్టులా.? అని మండిపడ్డారు. టీడీపీ పాదయాత్రతో జగన్ గుండెల్లో వణుకు మొదలైందన్నారు. ప్రజల హక్కుల్ని కాపాడండి అంటే అరెస్టులు చేయిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లిచ్చామని గుర్తుచేశారు. జగన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని కూడా ఒక వర్గానికి పరిమితం చేశారని పేర్కొన్నారు. జగన్...ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంలా దాపురించారని వ్యాఖ్యానించారు.