రోజూ తాగివచ్చి కొడుతున్న భర్త... విసిగిపోయిన భార్య... తగిన సమయం చూసి ఎటువంటి దాడి చేసిందంటే...
ABN , First Publish Date - 2022-08-02T17:22:29+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో...
ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఓ షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ భార్య తన భర్తపై యాసిడ్ దాడి చేసింది. దీనికిముందు తాము బాత్రూంలో వాడుతున్న యాసిడ్ను గ్యాస్ స్టౌపై చాలా సేపు మరిగించింది. దానిలో కారం కలిపింది. తగిన సమయం చూసి భర్తపై ఆ మరుగుతున్న యాసిడ్ పోసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లా నవాబ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మద్యం సేవించి భర్త ఆమెను తరచూ కొట్టేవాడని, దీనికి ప్రతీకారంగా భార్య ఈ చర్యకు పాల్పడిందని సమాచారం.
వివరాల్లోకి వెళితే బరేలీలోని నవాబ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న మహ్మద్ యాసిన్ కుమార్తె ఫరాకు ఆ ప్రాంతంలోని ఇస్లాంనగర్కు చెందిన మహ్మద్ యాసిన్తో 6 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య తరచూ ఏదో ఒక విషయమై గొడవలు జరిగేవి. ఇటీవల భర్త కుటుంబ సభ్యులు ఫరాపై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కలత చెందిన భార్య తన భర్తపై యాసిడ్ దాడి చేసింది. ఈ నేపధ్యంలో యాసిన్ కుటుంబ సభ్యులు ఫరాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు జిల్లా ఆస్పత్రిలో చేరిన భర్త పరిస్థితి మెరుగుపడుతోంది. వేడినీళ్లలో ప్రమాదకర రసాయనం కలిపారని, అది ఏమిటనే దానిపై విచారణ జరుపుతున్నామని జిల్లా ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.