గోలివాడ పంప్‌హౌస్‌ను సందర్శించిన ఏసీపీ

ABN , First Publish Date - 2022-07-07T05:50:27+05:30 IST

మండల పరిధి గోలివాడ శివారులోని పార్వతి పంప్‌హౌస్‌ ను బుధవారం గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌ సందర్శించారు.

గోలివాడ పంప్‌హౌస్‌ను సందర్శించిన ఏసీపీ
పంప్‌హౌస్‌ను పరిశీలిస్తున్న ఏసీపీ గిరి ప్రసాద్‌

అంతర్గాం, జూలై 6: మండల పరిధి గోలివాడ శివారులోని పార్వతి పంప్‌హౌస్‌ ను బుధవారం గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌ సందర్శించారు. రెండు రోజులుగా వర్షం కరుస్తుండడంతో భారీగా వరదనీరు గోదావరిలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏసీపీ గోదావరి నీటిమట్టంను పంప్‌హౌస్‌ పరిసరాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాలు ముంపునకు గురయ్యే పరిస్థితి తలెత్తితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పంప్‌హౌస్‌ అధికారులకు సూచించారు. సమీప గ్రామాల్లోకి గోదావరి నీరు పోటెత్తే పరిస్థితులు తలెత్తినట్లయితే అధికారులకు తెలియజేయాలని గోలివా డ, ఎల్లంపల్లి, ముర్మూర్‌ గ్రామాల ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమం లో రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, అంతర్గాం ఎస్‌ఐ సంతోష్‌ కుమార్‌, సర్పంచ్‌ దర్ని రాజేష్‌, ఎంపీటీసీ లక్ష్మిమహేందర్‌రెడ్డి, పంప్‌హౌస్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T05:50:27+05:30 IST