వెయ్యి పడకల ఏర్పాటుకు చర్యలు
ABN , First Publish Date - 2021-05-11T03:48:28+05:30 IST
కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు టిడ్కో గృహాల్లోని కొవిడ్ కేర్సెంటర్లో వెయ్యి పడకల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు సబ్కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు
గూడూరురూరల్, మే 10: కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు టిడ్కో గృహాల్లోని కొవిడ్ కేర్సెంటర్లో వెయ్యి పడకల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు సబ్కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. సోమవారం స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల వివరాలను ఎప్పటికప్పుడు నోటీసు బోర్డులో ఉంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాక్షిక లాక్డౌన్కు ప్రజలు సహకారం అందిస్తున్నారన్నారు. కర్ఫ్యూ సమయంలో బయట తిరగకుండా ఇంటిలోనే సురక్షితంగా ఉండాలన్నారు. ప్రతిఒక్కరు మాస్కులు ధరిస్తూ కొవిడ్ నిబంధనలను పాటించాలన్నారు.