దుర్భాషలాడిన సర్పంచ్పై చర్య తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-01-17T05:57:02+05:30 IST
అధికారుల సమక్షంలో గ్రామస్థులను దుర్భాషలాడిన సర్పంచ్ విమలమ్మపై చర్య తీసుకోవాలని మల్లికార్జునపల్లి ఉపసర్పంచ్ విఠల్రెడ్డి, శివాజీయూత్ నాయకులు మహే్ష డిమాండ్ చేశారు.
మునిపల్లి, జనవరి 16: అధికారుల సమక్షంలో గ్రామస్థులను దుర్భాషలాడిన సర్పంచ్ విమలమ్మపై చర్య తీసుకోవాలని మల్లికార్జునపల్లి ఉపసర్పంచ్ విఠల్రెడ్డి, శివాజీయూత్ నాయకులు మహే్ష డిమాండ్ చేశారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుపై గ్రామస్థులు, తహసీల్దార్, ఎంపీడీవో సమక్షంలో చర్చిస్తుండగా సర్పంచ్ కల్పించుకుని దుర్భాషలాడినట్టు ఆరోపించారు. అధికారులు ఆమెను వారించినా వినలేదని వారు అసహనం వ్యక్తం చేశారు. సర్పంచ్ తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు.