ఉపాధి ఆధికారులపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-04-24T04:40:04+05:30 IST

ఉపాధి హామీ పనుల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ మిత్ర కుంరంభీం జిల్లా అధ్య క్షుడు అడ వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు.

ఉపాధి ఆధికారులపై చర్యలు తీసుకోవాలి
మాట్లాడుతున్న ఆదివాసీ మిత్ర వెల్ఫేర్‌ సొసైటీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌

సిర్పూర్‌(యు), ఏప్రిల్‌ 23: ఉపాధి హామీ పనుల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ మిత్ర కుంరంభీం జిల్లా అధ్య క్షుడు అడ వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లా డుతూ ఉపాధిహామీ పథకంలో కొద్ది రోజుల నుంచి అవినీతి జరుగుతున్న ప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకో వడం లేదన్నారు. ఉపాధిహామీ పనులకు సంబంధించిన అంశంపై సమాచార హక్కు కింద దరఖాస్తు చేసినప్పటికీ అధికారులు వెల్లడించడం లేదని అన్నారు. దీంతో ఈ పథకంలోని లొసుగులు, అవినీతి భాగోతం బయట పెట్టేందుకు కలెక్టర్‌, ఉపాధిహామీ కమిషనర్‌ ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా సిర్పూర్‌(యు) మండ లంలో ఈజీఎస్‌ అధికారులు కూలీలకు సరిపడు పనులను కల్పించడంలో విఫలం అవుతున్నారని విమర్శించారు. ఉన్నతాధికారులు స్పం దించి వెంటనే ఉపాధిపనులపై సమగ్రదర్యాప్తు చేప ట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. గోడాం జ్ఞానేష్‌, కనకమారుతి, గేడాం రోహిదాస్‌, నరేష్‌ ఉన్నారు.

Updated Date - 2021-04-24T04:40:04+05:30 IST