‘నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు చేపట్టాలి’

ABN , First Publish Date - 2021-05-11T04:46:27+05:30 IST

ముగ్గురాళ్ల గనిలో జరిగిన పేలుళ్ల ఘటనలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు చేపట్టాలని ప్రజాసంఘాల నాయకులు ప్రవీణ్‌కుమార్‌, హుసేన్‌పీరా డిమాండ్‌ చేశారు.

‘నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు చేపట్టాలి’

కలసపాడు, మే 10 : ముగ్గురాళ్ల గనిలో జరిగిన పేలుళ్ల ఘటనలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు చేపట్టాలని ప్రజాసంఘాల నాయకులు ప్రవీణ్‌కుమార్‌, హుసేన్‌పీరా డిమాండ్‌ చేశారు. సోమవారం మండల కేంద్రమైన కలసపాడులోని తహసీల్దారు కార్యాల యం ఎదుట అర్ధనగ్నంగా ఆందోళన చేపట్టా రు. దాదాపు కొన్ని సంవత్సరాలుగా అక్రమం గా ముగ్గురాళ్లను వెలికితీస్తున్నా కనీసం స్థానిక అధికారులు కానీ, ఉన్నతాధికారులు కానీ పరిశీలించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. చనిపోయిన వారికి వెంటనే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-11T04:46:27+05:30 IST