ఉమామహేశ్వరిని వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-25T06:59:07+05:30 IST

చిత్తూరుకు చెందిన దళిత మహిళ ఉమామహేశ్వరిపై దొంగతనం నింద మోపి, ఆమెను వేధించిన అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

ఉమామహేశ్వరిని వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
ఆందోళన చేస్తున్న ప్రజాసంఘాల నాయకులు

పీలేరు, జనవరి 24: చిత్తూరుకు చెందిన దళిత మహిళ ఉమామహేశ్వరిపై దొంగతనం నింద మోపి, ఆమెను వేధించిన అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. సోమవారం పట్టణ నాలుగు రోడ్ల కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఉమామహేశ్వరి కేసుకు సంబంధించి కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌తో సరిపోదని గుర్తుచేశారు. ఇందులో తప్పుడు ఫిర్యాదు చేసిన జిల్లా జైలు సూపరింటెండెంట్‌ వేణుగోపాల్‌రెడ్డి, పలువురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఓ మహిళపై థర్డ్‌డిగ్రీ ఉపయోగించడం దారుణమనీ, బాధితురాలికి ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ధరణికుమార్‌, శ్రీనివాసులు, మహేష్‌, బోదేషావలి, మౌలా, సుభాష్‌, మల్లికార్జున, వెంకట్రామయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T06:59:07+05:30 IST