‘గంగ జాతర’కు అడ్డు తగిలిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-07-01T06:02:42+05:30 IST
‘గంగ జాతర’కు అడ్డు తగిలిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి
తాండూరు రూరల్, జూన్ 30 : వర్షాలు కురవాలని కాగ్నా నదిలో గంగమ్మ తెట్టెలను విడిచేందుకు వెళుతున్న గోనూర్ మహిళలను అడ్డుకున్న కొల్లి పరశురాంపై వెంటనే చర్యలు తీసుకోవాలని గోనూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం తాండూరు మండల కరన్కోట్ పోలీ్సస్టేషన్ ఎదుట గ్రామానికి చెందిన గోపాల్రెడ్డి, హరినాథ్రెడ్డిల ఆధ్వర్యంలో మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం 6గంటలకు గంగజాతరకు వెలుతుంటే గ్రామానికి చెందిన పరశురాం సాయంత్రం మాల బిచ్చమ్మ, రాము, మాల నర్సమ్మలను అడ్డుకుని బూతుమాటలు తిట్టి గంగజాతరకు వెళ్లే వస్తువులను పారవేశారని కరణ్కోట్ పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేశారు.