కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-04-24T04:54:05+05:30 IST
కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి
పరిగి: కోర్టుఆదేశాలను ధిక్కరించిన గోవిందాపూర్ పంచాయితీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య డిమాండ్ చేశారు. మండలంలోని గోవిందాపూర్ గ్రామానికి చెందిన అనంతరెడ్డికి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వకుండా డబ్బులు డిమాండ్ చేస్తున్న కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం, ఎల్హెచ్పీఎ్స, కేవీపీఎస్, భీమ్ఆర్మీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సర్పంచ్కు బదులుగా ఆమె కొడుకు గ్రామంలో ఏం అడిగినా జనాన్ని బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఇంటినిర్మాణానికి కార్యదర్శి రూ.20వేలు డిమాండ్ చేసిందని బాధితులు తెలిపారు. అవినీతి అధికారిపై చర్యలు తీసుకోవాలని లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పీఎ్స, కేవీపీఎస్, భీమ్ఆర్మీ సంఘాల నాయకులు గోవింద్నాయక్, అంజీర రావణ్, శ్రీనివాస్, జంగయ్య, కృష్ణ పాల్గొన్నారు.