అసైన్డ్‌ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-05-11T06:05:01+05:30 IST

మండలంలోని కన్గుట్ట గ్రామంలోని సర్వే నెంబర్‌ 23లో 3 ఎకరాల భూమిని కన్గుట్ట గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కబ్జాకు పాల్పడ్డాడని అతనిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామానికి అభివృద్ధి కమిటీ సభ్యులు కోరారు.

అసైన్డ్‌ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

బోథ్‌, మే 10: మండలంలోని కన్గుట్ట గ్రామంలోని సర్వే నెంబర్‌ 23లో 3 ఎకరాల భూమిని కన్గుట్ట గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కబ్జాకు పాల్పడ్డాడని అతనిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామానికి అభివృద్ధి కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్‌ శివరాజ్‌కు వినతి పత్రం సమర్పించారు. గ్రామానికి చెందిన దాదాపు 50 మంది ఈ విషయమై తహసీల్దార్‌కు వివరించారు. అసైన్డ్‌ భూమి కబ్జా వల్ల పశువులను మేపడానికి ఇబ్బందిగా మారిందని వారు వివరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T06:05:01+05:30 IST