యువకుడి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-26T04:24:10+05:30 IST

యువకుడి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి

యువకుడి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి
ధర్నా చేస్తున్న మనోజ్‌ బంధువులు

కీసర, జనవరి 25: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతు డి బంధువులు మంగళవారం కీసర పోలీస్‌ స్టేషన్‌ వద్ద ధర్నా చేశారు. వన్నీగూడెంకు చెందిన రెడ్డబోయిన మనోజ్‌ (21) ద్విచక్ర వాహనాన్ని ఈ నెల 23న కీసర సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మనోజ్‌ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కీసర పీఎస్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రమాదానికి కారకులను గుర్తించలేదన్నారు. 

Updated Date - 2022-01-26T04:24:10+05:30 IST