యువకుడి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-01-26T04:24:10+05:30 IST
యువకుడి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి
కీసర, జనవరి 25: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతు డి బంధువులు మంగళవారం కీసర పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. వన్నీగూడెంకు చెందిన రెడ్డబోయిన మనోజ్ (21) ద్విచక్ర వాహనాన్ని ఈ నెల 23న కీసర సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మనోజ్ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కీసర పీఎస్ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రమాదానికి కారకులను గుర్తించలేదన్నారు.