నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-05-18T05:34:16+05:30 IST

నిబంధనలు పాటించకుంటే మిల్లర్లపై చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ విజయసునీత హెచ్చరించారు. మంగళవారం కోమర్తి, నరసన్నపేటలలో రైస్‌ మిల్లులు, రేషన్‌ డిపోలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. సీఎంఆర్‌ విధానంలో ప్రభుత్వానికి ఇవ్వా ల్సిన బియ్యా న్ని ఈనెలాఖరు నాటికి ఇవ్వకుంటే రైస్‌ మిల్లులను సీజ్‌ చేస్తా మన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
బియ్యాన్ని పరిశీలిస్తున్న జేసీ విజయసునీత

జేసీ విజయసునీత 

నరసన్నపేట: నిబంధనలు పాటించకుంటే మిల్లర్లపై చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ విజయసునీత హెచ్చరించారు. మంగళవారం కోమర్తి, నరసన్నపేటలలో రైస్‌ మిల్లులు, రేషన్‌ డిపోలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎంఆర్‌ విధానంలో ప్రభుత్వానికి ఇవ్వా ల్సిన బియ్యా న్ని ఈనెలాఖరు నాటికి ఇవ్వకుంటే రైస్‌ మిల్లులను సీజ్‌ చేస్తామన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చిన ధాన్యంతో వ్యాపారాలు చేసుకుంటామంటే ఉపేక్షించేంది లేదని స్పష్టం చేశారు. సకాలంలో మరపట్టిన బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. సివిల్‌ సప్లయ్‌ అధికారులు మొద్దునిద్ర వీడి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. దేశవానిపేట రేషన్‌ డిపోను పరిశీలించారు. కార్యక్రమంలో సివిల్‌ సప్లయ్‌ డీఎం జయంతి, తహసీల్దార్‌ కె.ప్రవల్లిక ప్రియ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-05-18T05:34:16+05:30 IST