కార్యకర్తలే పార్టీకి వెన్నెముక
ABN , First Publish Date - 2021-02-28T05:29:55+05:30 IST
కార్యకర్తలే పార్టీకి వెన్నెముకని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలంలోని చీకటిమామిడిలో జరిగిన సమావేశంలో మాట్లాడారు.
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి
తుర్కపల్లి/యాదాద్రిరూరల్/బీబీనగర్/భూదాన్పోచంపల్లి/ ఆలేరు, ఫిబ్రవరి 27: కార్యకర్తలే పార్టీకి వెన్నెముకని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలంలోని చీకటిమామిడిలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. సంక్షేమ పథకాలు వివరించి సభ్య త్వాలు నమోదు చేయించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలగౌని వెంకటేశ్గౌడ్, ఆల్డా చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి ఉన్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు చంద్రగాని జహంగీర్గౌడ్, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేపాక స్వామి సభ్యత్వాలు నమోదు చేయించారు. కార్యక్రమంలో గుర్ర శంకర్, ఎండీ. అజ్జు, కానుగు భిక్షంగౌడ్, బండి మహేష్ పాల్గొన్నారు. బీబీనగర్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాచమల్ల శ్రీనివాస్, పింగల్రెడ్డి, జైపాల్రెడ్డి పాల్గొన్నారు. యాదగిరిగుట్ట 3వ వార్డులో 500 సభ్యత్వాలు నమోదు చేయించిన టీఆర్ఎస్ నాయకుడు పాపట్ల నరహరిని విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అభినందించారు. భూదాన్పోచంపల్లిలో సభ్యత్వ నమోదును మునిసి ప ల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి ప్రారంభించారు. ఆలేరులో జరిగిన సమావేశంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి మాట్లాడారు.