కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
ABN , First Publish Date - 2021-07-26T04:04:51+05:30 IST
రాష్ట్రంలో బీజేపీ అద్వితీయ శక్తిగా ఎదిగేందుకు పల్లెలు, పట్ట ణాలు అనే తేడాలేకుండా కార్యకర్తలు సైనికుల్లా శక్తివంచన లేకుండా పని చేయాల్సిన అవస రం ఉందని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి తెలిపారు.
- జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి
కల్వకుర్తి టౌన్, జూలై 25: రాష్ట్రంలో బీజేపీ అద్వితీయ శక్తిగా ఎదిగేందుకు పల్లెలు, పట్ట ణాలు అనే తేడాలేకుండా కార్యకర్తలు సైనికుల్లా శక్తివంచన లేకుండా పని చేయాల్సిన అవస రం ఉందని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి తెలిపారు. కల్వకుర్తిలోని విద్యాన గర్ కాలనీలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో బీజే పీ అధికారంలోకి వచ్చేందుకు అత్యంత సానుకూలంగా ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కేంద్ర అధినాయకత్వ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్యకర్తలు వచ్చే ఎన్నికలకు సర్వ సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. అంతకు ముందు నాగర్కర్నూల్ బీజేపీ అధ్యక్షుడు సుధాక ర్రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో బీజేపీ అధికారంలోకి రానుందని, అం దుకోసం ప్రణాళికాబద్దంగా కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొన్నారు.
పట్టణ కమిటీ ఎన్నిక
కల్వకుర్తి పట్టణ అధ్యక్షుడిగా నరసింహ, ప్రఽధాన కార్యదర్శిగా విజయ్, నరేష్గౌడ్, ఉపాధ్య క్షులుగా రామాంజనేయులు, శ్రీకాంతాచారి, శ్రీనివాసులు, లింగం వెంకటేష్, నవీన్, రమేష్చారి, గన్నోజు బాబి, కాశముని బాలరాజు, నవీన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణగౌడ్, సీనియర్ నాయకుడు దుర్గాప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాఘవేంద్రగౌడ్, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నిరంజన్గౌడ్, ప్రధాన కార్యదర్శి రవిగౌడ్, పర్వతాలు, శేఖర్రెడ్డి, సంతుయాదవ్, గండూరు ఎంపీటీసీ నర్సిరెడ్డి పాల్గొన్నారు.