ముందస్తు elections వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి: Chandrababu
ABN , First Publish Date - 2022-05-17T23:45:09+05:30 IST
ముందస్తు elections వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి: Chandrababu
అమరావతి: క్షేత్రస్థాయి కమిటీలతో Andhra pradesh Former Cm నారా చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బాదుడే బాదుడు, మెంబర్షిప్, ఓటర్ వెరిఫికేషన్, మహానాడుపై Chandrababu సమీక్షించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు టీడీపీ ఇప్పుడు ఒక హోప్గా కనిపిస్తుందని, గ్రామాల్లో టీడీపీకి స్వాగతాలు, గడపగడపలో వైసీపీ నేతలకు నిలదీతలే అందుకు నిదర్శనని చంద్రబాబు అన్నారు. జగన్ పథకాలు బూటకమేనని ప్రజలకు అర్థమౌతుందని చంద్రబాబు తెలిపారు. అన్ని గమనించే జగన్ ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్నారని, ముందస్తు ఎన్నికలు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. అన్నివర్గాల్లో ప్రభుతంపై వ్యతిరేకత పెరుగుతోందని, ప్రభుత్వాన్ని ఎంతోకాలం నడపలేమని సీఎంకు అర్థమైందని చంద్రబాబు తెలిపారు. అందుకే ముందస్తు ఎన్నికలు వెళ్లాలని జగన్ భావిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.