సాయిధరమ్తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది: అపోలో జేఎండీ
ABN , First Publish Date - 2021-09-11T17:21:20+05:30 IST
సినీ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో జేఎండీ సంగీతారెడ్డి తెలిరు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
హైదరాబాద్: సినీ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో జేఎండీ సంగీతారెడ్డి తెలిరు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం సాయి తేజ్కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని అపోలో జేఎండీ సంగీతారెడ్డి పేర్కొన్నారు. గత రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన సాయిధరమ్ తేజ్కి ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.