మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్న వరుణ్తేజ్
ABN , First Publish Date - 2022-05-26T06:07:31+05:30 IST
మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్న వరుణ్తేజ్
జంగారెడ్డిగూడెం, మే 25: గుర్వాయి గూడెం మద్ది ఆంజనేయ స్వామిని సినీనటుడు వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి బుధవారం దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణా ధికారి ఆకుల కొండలరావు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. స్వామి సన్నిధి లో వరుణ్తేజ్తో అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు. స్వామి దర్శనం అనంతరం అర్చకులు, వేద ఆశీర్వచనాలు అందజేశారు. వారిని శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాన్ని ఈవో కొండలరావు అందజేశారు. వరుణ్తేజ్ను చూసేందుకు అభిమానులు భారీగా తలివచ్చారు. వీరితో పాటు నటులు రచ్చ రవి, గెటప్ శ్రీను స్వామిని దర్శించుకున్నారు.