12న జాతీయ లోక్అదాలత్
ABN , First Publish Date - 2020-12-02T06:01:55+05:30 IST
12న జాతీయ లోక్అదాలత్
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి
సంగారెడ్డి క్రైం, డిసెంబరు 1 : ఈనెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్ను కక్షిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీ.పాపిరెడ్డి మంగళవారం ప్రకటనలో కోరారు. సంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణం, జోగిపేట, నర్సాపూర్, నారాయణఖేడ్, జహీరాబాద్, గజ్వేల్, సిద్దిపేట, మెదక్ న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాజీ అవకాశం ఉన్న క్రిమినల్, ఎక్సైజ్ కేసులతో పాటు చెల్లని చెక్కులు, విద్యుత్, కుటుంబ తగాదాలు, బ్యాంకు, భూసేకరణ, సివిల్ కేసులను ఇందులో పరిష్కరించనున్నట్లు వివరించారు. లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని చెప్పారు. కేసుల పరిష్కారం కూడా త్వరితగతిన లభిస్తుందని పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.