ఏడీసీ వేణుగోపాల్ మృతి తీరని లోటు
ABN , First Publish Date - 2021-05-11T07:27:29+05:30 IST
ఆర్టీసీ డిపోలో ఏడీసీగా పని చేస్తున్న వేణుగోపాల్ అకాల మరణం తీరని లోటని డిపో మేనేజర్ ఎస్.రామకృష్ణ అన్నారు.
కనిగిరి, మే 10 : ఆర్టీసీ డిపోలో ఏడీసీగా పని చేస్తున్న వేణుగోపాల్ అకాల మరణం తీరని లోటని డిపో మేనేజర్ ఎస్.రామకృష్ణ అన్నారు. కరోనాతో మృతి చెందిన వేణుగోపాల్ సంతాప సభ స్థానిక డిపో ఆవరణలో సోమవారం నిర్వహించారు. సిబ్బంది ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. వేణుగోపాల్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎం కామేశ్వరి, ఎస్టీఐ ఫణికుమార్, యూనియన్ నాయకులు సదానందం, నరేంద్ర, రమేష్బాబు, మనోహర్, శ్రీనివాసరావు, తిరుపతయ్య, సిబ్బంది పాల్గొన్నారు.