రాజీవ్‌ గృహకల్ప కాలనీలో అదనపు కలెక్టర్‌ పర్యటన

ABN , First Publish Date - 2021-05-11T05:10:20+05:30 IST

రాజీవ్‌ గృహకల్ప కాలనీలో అదనపు కలెక్టర్‌ పర్యటన

రాజీవ్‌ గృహకల్ప కాలనీలో అదనపు కలెక్టర్‌ పర్యటన
కాలనీలోని గుడిని పరిశీలిస్తున్నఅదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌

ఘట్‌కేసర్‌: పోచారం మున్సిపాలిటీలోని రాజీవ్‌ గృహకల్ప కాలనీలో ఉన్న గుడిని సోమవారం మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ జాన్‌ శాంసన్‌ పరిశీలించారు. పార్కు స్థలం ఆక్రమించి గుడి నిర్మించారని గత కొన్ని సవంత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికలో పార్కు స్థలం అక్రమించి గుడి నిర్మించారని, దీని వెనుక మంత్రి మల్లారెడ్డి హస్తముందని కథనం ప్రచురితమైంది. దీంతో అదనపు కలెక్టర్‌ గుడిని పరిశీలించి వివరాలు అడిగి తెలసుకున్నారు. అనంతరం సంస్కృతి టౌన్‌షిప్‌ నుంచి పోచారానికి వేళ్లేందుకు రోడ్డు వేయాలని పోచారం వాసులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తుండటంతో వివాదస్పదంగా మారిన రోడ్డు స్థలాన్ని సైతం అదనపు కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ నానావత్‌ రెడ్డియానాయక్‌, కమిషనర్‌ సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T05:10:20+05:30 IST