అర్హులందరికీ అదనపు ప్యాకేజీ: ఆర్డీవో జయరాం
ABN , First Publish Date - 2022-07-06T05:16:33+05:30 IST
వంశధార ఫేజ్-2 ప్రాజెక్టు నిర్మా ణంలో సర్వం కోల్పోయి నిర్వా సితులైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు ప్యాకే జీని అందించడం జరుగుతుందని టెక్కలి ఆర్డీవో హెచ్వీ జయరాం తెలిపారు. శ్యామలా పురం ఆర్అండ్ఆర్ కాలనీలో వున్న పాడలి, దుగ్గుపురం, తులగాం గ్రామాల వారితో సర్పంచ్ బలగ లక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం విచారణ చేపట్టారు.
శ్యామలాపురంఅర్అండ్ ఆర్కాలని(ఎల్.ఎన్.పేట): వంశధార ఫేజ్-2 ప్రాజెక్టు నిర్మా ణంలో సర్వం కోల్పోయి నిర్వా సితులైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు ప్యాకే జీని అందించడం జరుగుతుందని టెక్కలి ఆర్డీవో హెచ్వీ జయరాం తెలిపారు. శ్యామలా పురం ఆర్అండ్ఆర్ కాలనీలో వున్న పాడలి, దుగ్గుపురం, తులగాం గ్రామాల వారితో సర్పంచ్ బలగ లక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం విచారణ చేపట్టారు. సాంకేతిక కారణాల వల్ల కొందరి పేర్లు తప్పి పోయాయని వారి నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమగ్ర విచారణ చేసి వారికి ప్యాకేజీ అందజేస్తా మన్నారు. ఆయనతోపాటు తహసీల్దార్ బీఎస్ఎస్ సత్యనారాయణ తదితరులున్నారు.