టీడీపీ రాష్ట్ర ప్రతిభావంతుల కమిటీ ప్రధాన కార్యదర్శిగా అడుసుమల్లి

ABN , First Publish Date - 2022-08-14T05:53:11+05:30 IST

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభా వంతుల కమిటీ ప్రధాన కార్యదర్శిగా పామూరుకు చెందిన అడుసుమల్లి ప్రభాకర్‌ చౌదరి నియామకం అయ్యారు.

టీడీపీ రాష్ట్ర ప్రతిభావంతుల కమిటీ   ప్రధాన కార్యదర్శిగా అడుసుమల్లి

టీడీపీ రాష్ట్ర ప్రతిభావంతుల కమిటీ 

ప్రధాన కార్యదర్శిగా అడుసుమల్లి 

పామూరు, ఆగస్టు 13 :  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర  విభిన్న ప్రతిభా వంతుల కమిటీ ప్రధాన కార్యదర్శిగా  పామూరుకు చెందిన అడుసుమల్లి ప్రభాకర్‌ చౌదరి నియామకం అయ్యారు.  ఈ మేరకు టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు శనివారం ప్రక టించారు. మండలంలోని బొట్లగూడూరు గ్రామానికి చెందిన ప్రభాకర్‌  తొలి నుంచీ టీడీలోనే ఉన్నారు. టీడీపీ మండల అధ్యక్షునిగా, జిల్లా కమి టీ ఆర్గనైజింగ్‌ సభ్యుడిగా, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడిగా,  పామూరు క్లస్టర్‌  కోఆర్డినేటర్‌గా కొనసా గుతున్నారు. తనను విభిన్న ప్రతిభా వంతుల రాష్ట్ర కమిటీకి ఎంపిక చేసి నందుకు చంద్రబాబు, లోకేష్‌, అచ్చన్నా యుడు, ప్రతిభావంతుల కమిటీ మాజీ చైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు, పార్టీ ఇన్‌ చార్జి ఉగ్ర, నూకసాని బాలాజీ, ఒంగోలు పార్లమెంట్‌ రైతు సంఘ అధ్యక్షుడు ఏలూరి వెంక టేశ్వర్లు, పార్టీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, మండల నాయకులకు అడుసుమల్లి కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2022-08-14T05:53:11+05:30 IST