కార్మికులు ఆధార్‌ సీడింగ్‌ చేయించుకోవాలి

ABN , First Publish Date - 2020-12-04T04:52:08+05:30 IST

గుర్తింపు కలిగి కార్మికులు అందరూ ఈనెల 10వ తేదీ లోపు ఆధార్‌ సీడింగ్‌ చేయించుకోవాల్సిన అవసరం ఉందని రెండవ సర్కిల్‌ కార్మిక శాఖాధికారి కె.శివనాగమల్లేశ్వరరావు గురు వారం తెలిపారు.

కార్మికులు ఆధార్‌ సీడింగ్‌ చేయించుకోవాలి

తణుకు, డిసెంబరు 3 : గుర్తింపు కలిగి కార్మికులు అందరూ ఈనెల 10వ తేదీ లోపు ఆధార్‌ సీడింగ్‌ చేయించుకోవాల్సిన అవసరం ఉందని రెండవ సర్కిల్‌ కార్మిక శాఖాధికారి కె.శివనాగమల్లేశ్వరరావు గురు వారం తెలిపారు. తణుకు, ఉండ్రాజవరం, ఇరగవరం, అత్తిలి మండలాల పరిధిలోని భవన నిర్మాణ, ఇతర నిర్మాణ రంగ కార్మికులు ఆధార్‌ సీడింగ్‌ చేయించుకున్న తరువాత జిరాక్స్‌ కాపీలను తణుకులోని కార్మిక శాఖలో అందచేయాలన్నారు. కార్మిక శాఖ కార్యాలయంలో గుర్తి ంపు కార్డు, ఆధార్‌, బ్యాంకు పాస్‌ బుక్‌ మొదటి పేజీ జిరాక్స్‌, సెల్‌ఫోన్‌ నెంబరు ఇవ్వాలన్నారు. ఆధార్‌ సీడింగ్‌ చేయించుకోని కార్మికుల సభ్య త్వం రద్దు అయ్యే అవకాశం ఉందన్నారు.  

Updated Date - 2020-12-04T04:52:08+05:30 IST