అలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవు: ఆదిమూలపు
ABN , First Publish Date - 2022-06-16T17:40:26+05:30 IST
తిరుపతిలో పారిశుధ్య కార్మికుని మృతి లాంటి.. ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు.
అమరావతి: తిరుపతిలో పారిశుధ్య కార్మికుని మృతి లాంటి.. ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యం వహించినట్లు తేలితే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పురపాలక సంఘాల్లో కార్మికుల రక్షణ కోసం చేపట్టిన చర్యలపై మంత్రి ఆరా తీశారు. మృతి చెందిన కార్మికుని కుటుంబానికి మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి సురేష్ తెలిపారు.