ఏపీలో దరిద్రపు రాజకీయాలు: ఆదినారాయణరెడ్డి

ABN , First Publish Date - 2022-05-01T01:18:27+05:30 IST

ఏపీలో దరిద్రపు రాజకీయాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు.

ఏపీలో దరిద్రపు రాజకీయాలు: ఆదినారాయణరెడ్డి

అనంతపురం :  ఏపీలో దరిద్రపు రాజకీయాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు.  శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతి పథకంలోనూ దోపిడీ చేస్తుందన్నారు.  30 నెలల్లో 8 లక్షల కోట్ల అప్పు చేశాడు.. అప్పు చేయడమే తన పని అన్నట్లుగా జగన్ పాలన సాగుతోందన్నారు. ఆర్థిక మంత్రి నియోజకవర్గంలోనే రోడ్లు బాగా లేవని చెప్పారు.  కోడి కత్తి కేసు.. పొడవ లేదు ఎవడో పొడిచినట్లు తనపై దొంగ కేసు పెట్టారు. వివేకానంద రెడ్డిది హత్య అని వాళ్లకు తెలుసు.. హత్యను  గుండెపోటు అని ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు అంత మయసభ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఉందన్నారు. జగన్‌ని గద్దె దింపేందుకు చంద్రబాబునాయుడు బీజేపీతో కలిసి రావాలని సూచించారు.  ఏ పార్టీ అయినా బీజేపీతో కలిసి రావాల్సిందేనని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-05-01T01:18:27+05:30 IST