కంపోస్టు ఎరువుల తయారీ ప్రారంభించాలి

ABN , First Publish Date - 2020-12-04T04:53:54+05:30 IST

సెగ్రిగేషన్‌ షెడ్లలో కాంపోస్టు ఎరువుల తయారీని ప్రారంభించాలని అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీహర్ష అధికారు లను ఆదేశించారు.

కంపోస్టు ఎరువుల తయారీ ప్రారంభించాలి
సెగ్రిగేషన్‌ షెడ్డును పరిశీలిస్తున్న అడిషనల్‌ కలెక్టర్‌

- అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీహర్ష

    రాజోలి/అయిజ డిసెంబరు 3: సెగ్రిగేషన్‌ షెడ్లలో కాంపోస్టు ఎరువుల తయారీని ప్రారంభించాలని అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీహర్ష అధికారు లను ఆదేశించారు. రాజోలితో పాటు తూర్పు గార్లపాడు గ్రామాలలో గురువారం ఆయన పర్యటించి సెగ్రిగేషన్‌ షెడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో షెడ్లను వాడుకలోకి తేవాలని ఎంపీడీవో గోవిందురావును ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజోలి సర్పంచు వెంకటేశ్వరమ్మ, గోపాల్‌, తూర్పు గార్లపాడు సర్పంచు శేషమ్మ, ఏపీఎం ఖాజా పాల్గొన్నారు.


ప్రభుత్వాసుపత్రి పరిశీలన

    అయిజ ప్రభుత్వాసుపత్రిని శుక్రవారం అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలలో అబివృద్ధి పనులను పర్యవేక్షించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. సిబ్బంది విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ రామలింగారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:53:54+05:30 IST