Ayodhya రామమందిర ప్రధాన నిర్మాణానికి సీఎం యోగి శంకుస్థాపన

ABN , First Publish Date - 2022-06-01T17:39:23+05:30 IST

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం వైదిక ఆచారాల మధ్య అయోధ్యలో రామ మందిర ప్రధాన నిర్మాణానికి తొలి శంకుస్థాపన చేశారు....

Ayodhya రామమందిర ప్రధాన నిర్మాణానికి సీఎం యోగి శంకుస్థాపన

అయోధ్య: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం వైదిక ఆచారాల మధ్య అయోధ్యలో రామ మందిర ప్రధాన నిర్మాణానికి తొలి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ... దేవాలయం నిర్మాణం కోసం 500 ఏళ్ల పోరాటం ముగిసిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్నారు. దేవాలయ నిర్మాణ సాధన ఉద్యమంలో విశ్వహిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ పాత్రను యోగి గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 11 మంది అర్చకులు పూజలు జరిపారు.రామమందిర నిర్మాణ పనులకు సంబంధించిన పుస్తకాన్ని కూడా ఆదిత్యనాథ్ విడుదల చేశారు. 


రామమందిర నిర్మాణం చేపట్టిన ఇంజినీర్లను సీఎం సత్కరించారు.రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలోని బన్సీ పహార్‌పూర్‌లోని ఇసుకరాళ్లను ఆలయ ప్రధాన నిర్మాణం కోసం ఉపయోగించనున్నారు.16వ శతాబ్దపు బాబ్రీ మసీదు కూల్చివేసిన స్థలంలో ఆలయ నిర్మాణానికి 2019లో సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది.


Updated Date - 2022-06-01T17:39:23+05:30 IST