కోరం లేక జడ్పీ సర్వ సభ్య సమావేశం వాయిదా
ABN , First Publish Date - 2022-07-07T04:37:00+05:30 IST
జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన సర్వ సభ్య సమావేశానికి కోరం లేకపోవ డంతో జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదేలు వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు.
మంచిర్యాల కలెక్టరేట్, జూలై 6: జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన సర్వ సభ్య సమావేశానికి కోరం లేకపోవ డంతో జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదేలు వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశానికి అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతిని ధులు మూకుమ్మడిగా గైర్హాజరయ్యారు. కాగా చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అధికార పార్టీ సభ్యులు కినుక వహించినట్లు చెబుతున్నారు. సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి వచ్చారు. జిల్లా ఆయాశాఖల అధికారులు, కాం గ్రెస్ లక్సెట్టిపేట, దండేపల్లి, భీమిని జడ్పీటీసీ సభ్యులు ముత్తెసత్తయ్య, నాగమణి, గంగమ్మ, లక్సెట్టిపేట్ ఎంపీపీ మంగ చిన్నన్న హాజర య్యారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా 12గంటల వరకు చూసి చైర్పర్సన్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల తీరుపై ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు.